తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. రేపు ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా పలు అంశాలు చర్చించే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సెక్రటేరియట్ కు రక్షణ భూముల కేటాయింపు, విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన వాటితో పాటు వివిధ కీలక అంశాలపై ముఖ్యమంత్రి భేటీలో చర్చించనున్నారు.