ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కలెక్టర్లే వారధిలాంటి వారని ఏపీ సీఎం జగన్ అన్నారు. జిల్లా కలెక్టర్లంతా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించాలని జగన్ సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉంటేనే వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు. అబ్ధిదారుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా ముఖ్యమని చెప్పారు.
రాత్రి పూట హాస్టల్స్, ఆస్పత్రులు, పల్లెల్లోకలెక్టర్లు నిద్ర చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా కనీసం 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని చెప్పారు. కొందమంది జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లడం లేదనే సమాచారం తనకు వచ్చిందని, ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. పాలనలో కలెక్టర్లే తన కళ్లు, చెవులని జగన్ పేర్కొన్నారు.