telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం… 22 మంది మృతి

పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. దేశంలోని సిహువాస్ ప్రావిన్స్ పరిధిలోని అంకాష్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సంఘటనలోని 20 మంది మృతి చెందగా.. మరో ఇద్దరినీ ఆస్పత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ సాధారణ ఎన్నికల్లో ఓటు వేసి.. వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హుటహుటిన ప్రమాద స్థలానికి వచ్చిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts