telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉగాది కానుకగా.. చెర్రీ, పూజాహెగ్డేల రొమాంటిక్ ఫోటో రిలీజ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’. అయితే ఆచార్య గత షెడ్యూల్ గోదావరి ఖనిలోని మైనింగ్ ప్రాంతంలో జరిగింది. అది పూర్తి కాగానే చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. అయితే… తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మళ్ళీ మొదలైంది. ఇక చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు.
అయితే తాజాగా ఉగాది సందర్బంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ…ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర సభ్యులు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్- పూజ హెగ్డే ఉన్నారు. చరణ్ పూజతో ఉన్న రొమాంటిక్ ఫోటోను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆచార్య లో తన పాత్రకు సంబందించిన షూటింగ్ ను పూర్తి చేసాడు చరణ్.  

Related posts