ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడే ముందు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుమతికి ఆయన చివరి కాల్ చేశారు. ఈ విషయాన్ని కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. 20 రోజుల క్రితమే కోడెల హైదరాబాదుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కోడెలప్రతి రోజూ ఉపయోగించే మెడిసిన్స్ కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
కోడెల కూతురు, భార్య, గన్ మెన్, డ్రైవర్ తో పాటు మరో నలుగురిని ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు పెట్టారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా కేసును పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు, ఆత్మహత్యకు కోడెల రకరకాలుగా ప్లాన్ చేసుకున్నట్టు భావిస్తున్నారు. తొలుత తన పంచెతో ఉరివేసుకోవాలని ఆయన భావించారని, అది సాధ్యం కాకపోవడంతో, చివరకు నైలాన్ వైరును ఉపయోగించుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాల్లేవు..