telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఆ మహమ్మారి కరోనాకు బలయ్యారు. అయితే తాజాగా మహమ్మారి వైరస్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా సోకింది. ఇవాళ నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,892 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 767465 కు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు ఇవాళ తగ్గాయి. ఈరోజు 28 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6319కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 767465 పాజిటివ్ కేసులకు గాను, 719477 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రస్తుతం 41669 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

Related posts