లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని, ఆ బడ్జెట్ లోనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ (ఓట్ ఆన్ అకౌంట్)ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్నే ప్రవేశపెట్టనుందని సీఎం కేసీఆర్ తెలిపారు.సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు.
సర్పంచులు, ఉపసర్పంచులకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎంసీఆర్హెచ్చార్డీ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలి. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలసికట్టుగా పనిచేయడానికి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తగా రూపొందించిన చట్టంపై గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.