telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షల జరిమానా విధించిన ఏపీ…

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి ఆసుపత్రి, పీలేరు లోని ప్రసాద్ ఆసుపత్రి, మదనపల్లి లోని చంద్ర మోహన్ నర్సింగ్ హోమ్ లపై లక్షలాది రూపాయలు ఫైన్లు విధించింది జిల్లాయంత్రాంగం. 3 రోజుల్లో విధించిన రుసుం కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆసుపత్రుల యజమాన్యం పై ఐపీసీ 188, 406, 420, 53 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.డ్రగ్ ఆడిట్ లో బయటపడ్డ రెమ్ డెసివర్ ఇంజక్షన్ల అక్రమ వినియోగం, ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా బెడ్ లు ఏర్పాటు చేసుకోవడం, ఆరోగ్యశ్రీ బాధితుల నుంచి అడ్వాన్సులు పట్టించుకుని వైద్యం చేయడం, అధిక ధరలకు సిటీ స్కాన్ లు నిర్వహించడం లాంటి అక్రమాలు జరిగాయని గుర్తించారు అధికారులు. 

Related posts