telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

srikanthreddy ycp

తప్పుచేశానని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలో వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తోన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించడంలో కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తనపై కొందరు వ్యక్తులు, కొన్ని ప్రజాసంఘాలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.

కళాశాలకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది నిజమేనని, కానీ అందులో ఎటువంటి ప్రైవేటు నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నియోజక వర్గ ప్రజల అభీష్టాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు చేయమని స్పష్టం చేశారు. తప్పుచేశానని అనుకుంటే స్వచ్ఛందంగా రాజకీయాలనుంచి వైదొలుగుతానని చెప్పారు.

Related posts