సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ శ్రేణులు ముందస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జై టీడీపీ, జయహో చంద్రబాబు అని నినాదాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నేత జోహార్ చంద్రబాబు అన్నారు.
దీంతో ఒక్కసారిగా మిగిలిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఖంగుతిన్నారు. వెంటనే అతడిని వారించిన మిగిలిన నేతలు నవ్వుల్లో మునిగిపోయారు. జోహార్ కాదు జయహో అని చెప్పాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.