సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పరిపాలనపై ముఖ్యమంత్రి జగన్ కు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో ఓ మంచి సమాజాన్ని నిర్మించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని అన్నారు.
ఈ విషయాన్ని ‘నవరత్నాలు’ లో జగన్ స్పష్టంగా చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ‘నవరత్నాలు’ను జగన్ సమర్ధంగా అమలు చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శ్రీ పథకం అధ్వాన స్థితిలో ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయని, ఈ పథకం అమలుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. పారదర్శకంగా, నిజాయతీగా, క్లీన్ గవర్నెన్స్ ను అందించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు.
పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వానికి చులకనైపోయింది: బోండా ఉమా