తమిళనాడులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూలిన ఘటనలో 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు: నారా లోకేశ్