telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోహ్లీ అర్ధశతకం… ఇంగ్లాండ్ టార్గెట్…?

మేతేరా వేదికగా జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు మొదట భారత్ కు చుక్కలు చూపించారు. టీం ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఈ క్రమంలో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు మరో 20 పరుగుల వ్యవధిలో పంత్, అయ్యర్ రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. అయితే ఇదే సమయంలో క్రీజులో కుదురుకున్న భారత్ కెప్టెన్ కష్టాలో ఉన్న జట్టును ఆదుకున్నాడు. 37 బంతుల్లో టీ 20 లో తన 27 వ అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత రెచ్చిపోయాడు. వరుస సిక్సులు, బౌండరీలు బాదుతూ 77 పరుగులతో రాణించాడు. అలాగే కోహ్లీకి తోడుగా ఆడిన పాండ్యా(17) చివరి బంతికి ఔట్ కావడంతో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి156 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ 157 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది… ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts