telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

1,902 ఓట్లతో గంటా శ్రీనివాస రావు గెలుపు.. అధికారికంగా ప్రకటించిన ఈసీ

AP DSC Merit list released Minister Ganta

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాల ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత వీడింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 1,902 ఓట్లతో విజయం సాధించినట్లు ఈసీ అధికారికంగాప్రకటించింది.

42 వ పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎం నెంబర్ మధ్య వ్యత్యాసం ఉండటంతో వైసీపీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ఈసీకి నివేదించిన అధికారులు తుది ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు.

Related posts