ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాల ప్రకటనపై కొనసాగుతున్న సందిగ్ధత వీడింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 1,902 ఓట్లతో విజయం సాధించినట్లు ఈసీ అధికారికంగాప్రకటించింది.
42 వ పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎం నెంబర్ మధ్య వ్యత్యాసం ఉండటంతో వైసీపీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ఈసీకి నివేదించిన అధికారులు తుది ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు.
భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: మోదీ