telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వృద్దులను ఢీకొట్టిన కారు..అక్కడిక్కడే మృతి

Accident

బ్యాంకుకు వెళ్లి వస్తున్న వృద్ద దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో ఆ వృద్ధ దంపతులకు అక్కడిక్కడే మరణించారు. వారిని నాయిని ఎల్లయ్య (58), నాయిని వెంకటలక్ష్మి (52) గా గుర్తించారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మృతులు ధర్మాసాగర్ పరిధిలోని రాంపూర్ వాసులు.

పెన్షన్ తీసుకున్న తర్వాత రోడ్డు దాటుతుండగా, దూసుకువచ్చిన షివర్లే కారు వారిని ఢీకొట్టిందని, తాము ఈ ఘటనను సీసీ టీవీ ఫుటేజి ద్వారా తెలుసుకోగలిగామని ధర్మాసాగర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మహ్మద్ తెలిపారు. యాక్సిడెంట్ అనంతరం కారు ఆగకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

t

Related posts