telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉన్న అమరావతిని ఏపీ రాజధాని చేశామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా రాజధానిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని అవసరాలు పోగా 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. ఈ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మహానగరం నిర్మించేవాళ్లమన్నారు. భూమి అమ్మిన డబ్బులనే అమరావతికి ఖర్చు చేసినట్లు చెప్పారు. బ్యాంక్‌ల ద్వారా తక్కువ వడ్డీకి తెచ్చి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

విశాఖను ఐటీ, ఫార్మా హబ్‌గా అభివృద్ధి చేయాలనుకున్నామని వివరించారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని అడిగారు. ఆదానీ గ్రూప్‌ వచ్చి ఉంటే విశాఖ నాలుగైదు ఏళ్లలో హైదరాబాద్‌కు సమానంగా అభివృద్ధి చెందేదని తెలిపారు. కంపెనీలకు కేంద్రంగా విశాఖను చేయాలనుకున్నామని చెప్పారు. విశాఖలో మెట్రో కూడా శ్రీకారం చుట్టాం, కానీ అడ్డుపడ్డారని విమర్శించారు.

Related posts