నితిన్ హీరోగా నటించిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో ఆకట్టుకుంది.. ఆ తరువాత ‘శతమానంభవతి’ ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘కృష్ణార్జునయుద్ధం’, ‘తేజ్ ఐ లవ్ యు’, మళ్ళా రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
తాజాగా దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా నటిస్తున్న ‘రౌడీ బాయ్స్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కొత్త హీరోతో లిప్ లాక్స్ కూడా చేసింది.
ఇప్పటికే విడుదలైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలో సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘బృందానం నుంచి కృష్ణుడు వచ్చాడే.. యమునా తీరాన ఉన్న రాధను చూశాడే..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో గోపికమ్మ గెటప్లో అనుపమ లుక్స్ అదిరిపోయింది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా సుద్దాల అశోక్ తేజ పాటను రాయగా.. సింగర్ మంగ్లీ ఆలపించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను దిల్రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు ఫ్లాన్ చేస్తున్నారు.