“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు శ్రద్ధా కపూర్ పారితోషికం విషయమై ఇండస్ట్రీలో హాట్ చర్చ నడుస్తోంది. శ్రద్ధాకపూర్ బాలీవుడ్లో ఆమె పేరున్న హీరోయిన్నే అయినా రెమ్యునరేషన్ మాత్రం ఎప్పుడూ మూడు కోట్లు దాటలేదు. ఈవిడగారిని తెలుగులో నటించమని అడగగానే ఏకంగా ఏడుకోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట! దానికి తోడు ఈ సినిమా చేస్తున్నంత కాలం మరే హిందీ సినిమా చేయనని కూడా రాసిచ్చింది. అలా రాసిచ్చినందుకే ఏడు కోట్లు సమర్పించుకున్నారు. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ పక్కన నటించగానే సహజంగానే ఇక్కడి దర్శకనిర్మాతలు కళ్ళు శ్రద్ధామీదకు మళ్ళాయి. ఆమె రెమ్యునరేషన్ చూసి కొందరు కళ్ళు తేలేస్తే, ఆమె తమ సినిమాలో నటించడం ప్లస్ పాయింటవుతుందని అంత మొత్తం చెల్లించడానికి రెడీ అయిపోయారట. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆమెతో చర్చలు జరుపుతున్నారట కూడా. ఒక్క టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా శ్రద్ధా మీద దృష్టి సారించిందట. ‘సాహో’ మంచి విజయం సాధిస్తే శ్రద్ధ తన రెమ్యునరేషన్ ఏ పదికోట్లో పెంచేస్తుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
మాది పెద్ద సినిమా కాదు.. గొప్ప సినిమా..