నటి సమంత కొత్త ఏడాది లో జాను అనే సినిమాతో అభిమానులని పలకరించనుంది. తమిళ సూపర్ హిట్ చిత్రం 96కి రీమేక్గా జాను చిత్రం తెరకెక్కుతుండగా, ఇందులో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ వెర్షన్ను తెరకెక్కించిన ప్రేమ్కుమార్ తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో శర్వానంద్ కెమెరామెన్గా కనిపించనున్నాడు. దిల్ రాజ్-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే టీజర్ని చూసిన ఓ నెటిజన్ సమంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రీమేక్ షేడ్స్ ఎక్కడా కనిపించడం లేదు. సమంత మంచి నటి అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సమంత ఆ నెటిజన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. త్రిషని కాపీ కొట్టే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. జాను చిత్రం మంచి ఫీల్ గుడ్ చిత్రం. దీనిని ఒరిజినల్ వర్షెన్తో పోల్చలేం అని తెలియజేసింది.