telugu navyamedia
రాజకీయ వార్తలు

రెండు రాష్ట్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

OU students wrote letter to EC

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మూడో విడుత పోరుకు ఓటింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు , 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. గుజ‌రాత్‌తో పాటు కేర‌ళ‌లోనూ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స్పందించారు. ఈవీఎం సాంకేతిక స‌మ‌స్య‌ల గురించి ఈసీ దృష్టి పెట్టింద‌ని భావిస్తున్న‌ట్లు సీఎం అన్నారు. క‌న్నూరులో ఇవాళ ఉద‌యం ఆయ‌న ఓటేశారు. తిరువ‌నంత‌పురంలోని ఓ బూత్‌లో కొంత సేపు ఓటింగ్ నిలిపేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కొంత సేపు ఓటింగ్‌ను నిలిపివేశారు.

Related posts