స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడులైన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తమన్ స్వరకర్త. ముఖ్యంగా సామజవరగమన పాటను ఇప్పటికే 73 లక్షలపైగా వ్యూస్ సాధించి సౌత్లో అత్యధిక మంది చూసిన పాట రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్లాట్ ఫామ్స్లో టాప్లో ట్రెండ్ అవుతున్న ఈ పాట చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. సినిమాతో పాటు ప్రత్యేకంగా ఈ పాట మీద కూడా భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగ్గట్టుగా పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాట చిత్రీకరణ కోసం హీరో హీరోయిన్లతో పాటు చిత్రయూనిట్ పారిస్ చేరుకున్నారు. అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ అందిస్తున్నారు. తమన్ సంగీత సారథ్యం వహించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యమందించారు.
previous post
రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని