సినీ నటుడు అల్లరి నరేష్ ఇంట విషాదం నెలకొంది. దర్శకనిర్మాత ఈవీవీ సత్యనారాయణ తల్లి, సినీ నటుడు అల్లరి నరేష్ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ సోమవారం నాడు కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. వయసు పైబడడంతో అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె తన స్వగృహంలోనే మృతి చెందారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ ముగ్గురు కుమారులుండగా, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు. 2011లో ఈవీవీ మరణించిన తరువాత నుండి వెంకటరత్నమ్మ స్వస్థలమైన నిడదవోలు మండలం కోరుమామిడిలోనే నివసిస్తున్నారు. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఈవీవీ సత్తిబాబు, నిర్మాతా కానుమిల్లి అమ్మిరాజు వంటి వారు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
next post
“సైరా”తో “వార్”… చిరంజీవిపై హృతిక్ వ్యాఖ్యలు