telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్‌టీఆర్ సినిమాలో జయమ్మ..?

త్రివిక్రమ్, యంగ్ టైగర్ కాంబోలో రెండో సినిమాగా తెరకెక్కనుంది. దీనికి అయినను పోయిరావలే హస్తినకు అనే పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు చిత్రీకరణను ప్రారంభించనుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 20నుండి మొదలు చేయనున్నారట. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను మొదలు చేయనున్నారట. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నాడు. ఈ చిత్రంలో అతడి పాత్ర పూర్తి రాజకీయ నాయకుడిలా త్రివిక్రమ్ రూపొందించాడట.  ఈ సినిమాలో మరో గొప్ప నటి చేరనున్నారంట. ఈ ఏడాది క్రాక్ సినిమాతో అందరినీ మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారంట. దర్శకుడు త్రివిక్రమ్ కూడా వరలక్ష్మిని సినిమాలోకి స్వాగతించేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే పేరు ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఈ పేరును ఫిక్స్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారంట. ఇదివరకే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేశారు. అందుకే ఇప్పుడు ఎన్‌టీఆర్30లో కూడా ఉపేంద్ర చేసేందుకు ఓకే చెప్పారంట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలోని నటీనటుల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాల కోసం అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Related posts