ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమా తరవాత కొంత గ్యాప్ తీసుకున్న అజయ్ తన రెండో సినిమాకు మహాసముద్రం అనే పేరు పెట్టాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ నటించనున్నారు. మల్టీస్టారర్గా వస్తున్న ఈ సినిమా ద్వారా సిద్దార్థ మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో అనె ఇమ్మాన్యుయల్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ రోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా నుంచి ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ను చూస్తే శర్వానంద్ ఎదో యాక్షన్ సన్నివేశంలో ఉన్నట్లు అర్థం అవుతోంది. అంతేకాకుండా చూట్టూతా పడవలు ఉన్నాయి కాబట్టి ఎదో సముద్రతీరంలో ఫైట్ సీన్లా ఉంది. ఈ ఫస్ట్లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే పోస్టర్ వైరల్ అయింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post