telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు కరెంటు బిల్లు .. తెగ వేస్తున్నారు.. అన్యాయం.. : నటి రాయ్‌లక్ష్మీ

railakshmi on her electricity bill

నటి రాయ్‌లక్ష్మీ కరెంట్‌ బిల్లుపై గగ్గోలు పెడుతున్నారు. గత కొన్నినెలలుగా తన కరెంట్‌ బిల్లు తడిసి మోపడైతుందని, ఎంత కడితే అంతకు డబుల్‌ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆరా తీద్దామని ఆదాని ఎలక్ట్రీసిటీ సంస్థకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే ఎంతకు కలవడం లేదన్నారు. తనకే ఇలా ఉంటే సామన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా తన సమస్యను రాయ్‌ లక్ష్మీ అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని నెలలుగా నా కరెంట్‌ బిల్లులను పరిశీలిస్తే.. నేను ఎంత బిల్‌ పే చేస్తున్నానో అంతకు డబుల్‌ మరుసటి నెల వస్తోంది. ఇలా బిల్‌ డబుల్‌ అవ్వడం గత మూడు నెలలుగా చూస్తున్నాను.

ఈ విషయం గురించి తెలుసుకుందామని ఆదాని ఎలక్ట్రిసిటీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎన్ని సార్లు చేసినా కలవడం లేదు. ఎంత మంది ప్రజలు నా తరహా సమస్యతో బాధపడుతున్నారో? ఎవరైనా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా ఉచితంగా కట్టాలంటే బాధగా ఉంది.. అని ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంపై ట్విటర్‌ వేదికగా ఆదాని ఎలక్ట్రిసిటీ స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం, దయచేసి మీ వివరాలను తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తాం పేర్కొనడం కొసమెరుపు.

Related posts