telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేపు థియేటర్లలో చిన్న సినిమాల సందడి

Tollywood

న‌వంబ‌ర్ నెలాఖ‌రున తెలుగుతో పాటు ప‌లు డ‌బ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌య్యాయి. నిఖిల్‌, లావ‌ణ్య‌ త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంతోష్ తెర‌కెక్కించిన అర్జున్ సుర‌వ‌రం చిత్రం రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ సినిమాకి పోటీగా వ‌ర్మ నిర్మించిన అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా విడుద‌ల అవుతుంది. కాంట్ర‌వ‌ర్షియ‌ల్ చిత్రంగా ఈ సినిమా వార్త‌ల‌లోకి ఎక్కిన విష‌యం తెలిసిందే. కిర‌ణ్‌, ర‌హ‌స్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ర‌వికిర‌ణ్ కోలా తెర‌కెక్కించిన రాజా వారు రాణిగారు అనే సినిమా కూడా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఇక తెలుగు చ‌ల‌న‌చిత్ర పితామ‌హుడు ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందిన రఘుప‌తి వెంక‌య్య నాయుడు చిత్రం కూడా నవంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సీనియ‌ర్ న‌రేష్ ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. మ‌ణికర్ణిక జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన వారియ‌ర్ క్వీన్ ఆఫ్ జాన్సీ అనే ఇంగ్లీష్ చిత్రం, య‌మ‌లోకం.. ఇంద్ర‌లోకంలో సుంద‌ర‌వ‌ద‌న‌, ర‌ణ‌స్థ‌లం, క‌మాండో 3 అనే హిందీ చిత్రం రేపు థియేట‌ర్‌లోకి రానున్నాయి. మ‌రి సినీ అభిమానులు రేప‌టి సంద‌డికి సిద్ధంకండి మ‌రి.

Related posts