telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ పాలన: మంత్రి బొత్స

సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్, జగన్ లు ఆడిన మాట తప్పేవారుకాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20 కోట్లమంది అగ్రిగోల్డ్ బాధితులున్నారని వారిని ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్త శుద్ధితో కృషిచేస్తున్నారని అన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి, ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చారన్నారు. అధికారం చేపట్టాక హామీ ప్రకారం రూ.1150 కోట్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు. బాధితులకు చెక్కులను స్వయంగా జగనే అందజేయాలంటూ తాను కోరతానని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ సంస్థ ఆవిర్భవించిందని, అప్పుడే కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు.

Related posts