తాము ఒక్క పిలుపు ఇవ్వగానే రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి రైతుల దీక్ష శిభిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి ముంపు ప్రాంతం అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతిని ఇప్పుడు శ్మశానం అని, ఎడారి అని అంటున్నారని, నిర్మాణానికి డబ్బుల్లేవంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. కానీ గ్రీన్ ట్రైబ్యునల్ అమరావతి ముంపు ప్రాంతం కాదని స్పష్టం చేసిందని వెల్లడించారు.
జగన్ కు ఏసు ప్రభువుపై నమ్మకం ఉంటే రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అన్నారు. కాగా, ఏసు అనే వ్యక్తి గత ప్రభుత్వం తనకు ఇచ్చిన రూ.50 వేల పరిహారాన్ని చంద్రబాబు సమక్షంలో అమరావతి జేఏసీకి విరాళంగా ఇచ్చారు.