telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ పిట్ట కథలు చెప్పారు: తులసిరెడ్డి

Tulasireddy

ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో 20 మందికి పైగా ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధిస్తామని జగన్ పిట్ట కథలు చెప్పారని విమర్శించారు. ఇంత మెజార్టీ వచ్చినా హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పారు. అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ గతంలో చంద్రబాబు వైకుఠం చూపారని… ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో జగన్ కైలాసం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులే కావాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీలు రాష్ట్రానికి దుష్ట శక్తులుగా తయారయ్యాయని దుయ్యబట్టారు.

Related posts