telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తేలు కుట్టిన దొంగల్లా బీజేపీ నేతలు చేస్తున్నారు : హరీష్ రావు

బండి సంజయ్ అరెస్ట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. దుబ్బాకలో బీజేపీ కి నాయకులే లేరని.. ఒడిపోతామనే భయంతో యాగీ చేస్తుందని ఫైర్ అయ్యారు. డబ్బులు బీజేపీ వి కాకుంటే… రఘునందన్ డబ్బులు దొరికిన ఇంటికి ఎందుకు వచ్చారని.. తేలు కుట్టిన దొంగల్లా..బీజేపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు దొరికిన ఇంట్లో వ్యక్తి వాయిస్ రికార్డ్ ని ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని..మేము ఎన్నికల్లో ప్రజలను నమ్ముకుంటామన్నారు. అధికారులను కాదు ఎన్నికల కోడ్ జిల్లా మొత్తం ఉంటుందని… ఎక్కడైనా తనిఖీ చేస్తారని..బీజేపీ నాయకులకు అది కూడా తెలియదా..? అని ప్రశ్నించారు. 8 చోట్ల తనిఖీలు అని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. బీజేపీ నాయకుల ఇండ్లమీదే కాదు… నా సన్నిహితుడు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కూడా తనిఖీ చేశారని పేర్కొన్నారు. మా వాళ్ళ ఇంట్లో కూడా చిందర వందర చేశారు.. అయినా మేము సహకరించామని.. బీజేపీ యాగీ చేస్తే నాలుగు ఓట్లు వస్తాయని భ్రమలో ఉందని ఎద్దేవా చేశారు.

Related posts