హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య 16 వర్థంతి నేడు (జులై 31). ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘అల్లు రామలింగయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కంటే ఇప్పుడు ఆయన గురించి నాకు ఎక్కువ తెలుసు. నేను జీవితంలో చాలా విషయాలు అనుభవించాను. ఆయన ప్రయత్నాలు, పోరాటాలు, ప్రయాణాలకు నేను కనెక్ట్ అవుతాను. సినిమా పట్ల ఈ పేద రైతుల అభిరుచి కారణంగా మనమందరం ఈ రోజు ఇక్కడ వున్నాము’ అంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. పద్మశ్రీ పురస్కారం అందుకున్న రెండవ హాస్యనటుడు ఆయనే. గొప్ప మానవతావాది కూడా. జూలై 31, 2004న కన్నుమూశారు.
I remember this day when he left us . I know more about him now than on that day. The more I experience many things in life the more I connect to his efforts , struggles and journey. We all are here today in this position because of this poor farmers passion for cinema 🙏🏼 pic.twitter.com/eoREJPY3Xr
— Allu Arjun (@alluarjun) July 31, 2020