సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘శ్రీమంతుడు’. ‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’ చిత్రం చేసిన కొరటాల ఆ తర్వాత మళ్లీ మహేష్తో ‘భరత్ అనే నేను’ అనే చిత్రం చేశారు. ‘శ్రీమంతుడు’ చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపుదిద్దుకుంది. ఈ సూపర్ హిట్ మూవీ ఒక అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి మహేష్ బాబు చేసిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 2017 సెప్టెంబర్ 13న అప్లోడ్ చేసింది. ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా ఈ సినిమాను చూశారు. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. థియేటర్లో విడుదలై, టీవీల్లో పలు సార్లు ప్రసారమైన సినిమాను ఈ స్థాయిలో యూట్యూబ్లో చూడటం నిజంగా ఆశ్చర్యకరమే. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
Our 1st step crosses 100mn 😍https://t.co/XaQuDXKl7j@urstrulyMahesh @sivakoratala @shrutihaasan @ThisIsDSP#Srimanthudu pic.twitter.com/Dljn2jCLH2
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2020