సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై సినిమా నిర్మితమవుతుంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం కరోనా కారణంగా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం సమయం తీసుకుంటుంది. మరో పక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. అందులో ఓ హీరోయిన్గా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అనన్య ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ “ఫైటర్” సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఇక ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు.
next post