telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫారెస్టు అధికారులపై ప్రభుత్వ విప్‌ రేగా సంచలన వ్యాఖ్యలు

పినపాక ఎంఎల్ఎ, విప్ రేగా కాంతారావు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫారెస్టు అధికారులను టార్గెట్‌ చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు రేగా కాంతారావు.  భద్రాద్రి జిల్లా లో ప్రభుత్వ విప్ రేగా మరోసారి ఫారెస్టు అధికారులపై యుద్దానికి సిద్దం కావాలని పిలుపు నిచ్చాడు. సోషల్ మీడియా వేదికగా పినపాక ఎంఎల్ఎ రేగా కాంతారావు ఫారెస్టు అధికారులపై ఘాటుగా కామెంట్స్ చేశాడు. గతంలో రేగా కాంతారావు ఫారెస్టు అధికారులపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇప్పుడు మరోసారి మళ్లీ తన ఫేస్ బుక్ వేదికగా విమర్శలు చేశారు. గ్రామాల్లోకి ఫారెస్టు అదికారులను రానివ్వ వద్దని, వారు వస్తే నిర్బందించాలని తన అనుచరులకు పిలుపు నిచ్చాడు. వారు గ్రామాల్లోకి వస్తే మనం సర్వ నాశనం అవుతామని, మనకు ఇక దిక్కే ఉండదని అంటున్నాడు. తాను హైదరాబాద్ నుంచి నియోజకవర్గం వచ్చాక కార్యచరణ ప్రణాళిక సిద్దం చేస్తానని, ఫారెస్టుఅ ధికారులతో యుద్దానికి సిద్దం కావాలని పిలుపు నివ్వడం చర్చనీయాంశంగా మారింది.

Related posts