ఆస్ట్రాజెనికా-ఆక్స్ఫర్డ్ నేతృత్వంలో సీరం అభివృద్ది చేసిన రెండు మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను బ్రెజిల్కు శుక్రవారం ఇండియా ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే.. ఇండియాలో తయారైన రెండు మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లు బ్రెజిల్కు శనివారం చేరాయి. అయితే… వ్యాక్సిన్లు చేరుకోవడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారో ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉండగా ఇండియా వ్యాక్సిన్ సరఫరా చేయడంపై.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన ఆయన హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు… భారత వ్యాక్సిన్ తెచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ చిత్రాన్ని పోస్ట్ చేసిన బొల్సెనారో.. “వ్యాక్సిన్ ఎగుమతి చేసినందుకు భారత్కు ధన్యవాదాలు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఇండియాతో భాగస్వామ్యం కావడం గర్వంగా, గౌరవంగా ఉంది” అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోడీ సమాధానమిస్తూ.. ఆరోగ్య సంరక్షణపై తమ సహకారాన్ని బలోపేతం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. కాగా.. ఆస్ట్రాజెనికా-ఆక్స్ఫర్డ్ నేతృత్వంలో సీరం అభివృద్ది చేసిన రెండు మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను బ్రెజిల్కు శుక్రవారం ఇండియా ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే…
previous post
next post