telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వలస కూలీలను అనుమతించని ఏపీ పోలీసులు!

labour lockdwon

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వలస కూలీలను వారి స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై వాడపల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వలస కూలీలు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ నుండి వాడపల్లికి చేరుకున్న 100 మంది వలస కూలీలను ఆంధ్రా సరిహద్దు‌లోకి ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వం కూలీలను సొంత రాష్ట్రానికే పంపించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినా తమను ఏపీ పోలీసు అనుమతించలేదంటూ వలస కూలీలు ఆందోళన దిగారు.

Related posts