సీఎం సీటు విషయంలో కేసీఆర్కు ఇంటిపోరు పెరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ఈ అంశంపై డైనింగ్ టేబుల్ దగ్గర పంచాయితీ నడుస్తోందన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డితో కలిసి రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్ ఆశిస్తున్న సీఎం సీటుకు లింకు పెట్టారని చెప్పారు.
అందుకే మున్సిపల్ ఎన్నికలు తనకు పరీక్ష అని అంటున్నారనిపేర్కొన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన మార్పేమీ లేదన్నారు. ఆరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా అయ్యాయని తెలిపారు.