అనుమతి లేకుండా లారీలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో బుధవారం భారీగా 360 బ్యాగుల అమ్మోనియం నైట్రేట్ను సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మోనియం నైట్రేట్ను కర్నాటక నుంచి రాజస్థాన్కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు తరలించే వారి ఆచూకీ తమకు ఇవ్వాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను కోరారు.
నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనం..