telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సిద్దిపేటలో పేలుడు పదార్థాల స్వాధీనం

New couples attack SR Nagar

అనుమతి లేకుండా లారీలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో బుధవారం భారీగా 360 బ్యాగుల అమ్మోనియం నైట్రేట్‌ను సీజ్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

అమ్మోనియం నైట్రేట్‌ను కర్నాటక నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు తరలించే వారి ఆచూకీ తమకు ఇవ్వాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను కోరారు.

Related posts