telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించింది : కేన్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేయడం సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ… ‘భారత్‌లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించింది. బయో బబుల్‌లో ఉంటూ ఆడటం చాలా బాగా అనిపించింది. టోర్నీ నిలిచిపోయేవరకు బబుల్లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కానీ అక్కడక్కడ ప్రోటోకాల్స్ బ్రేక్ అయ్యాయి. దాంతో టోర్నీ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల వాయిదా వేయ్యడమే మంచి నిర్ణయం. టోర్నీ ఆగిపోయాక మమ్మల్ని మాల్దీవ్స్ పంపడం, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకెళ్లడం సవాలే అయినప్పటికీ బీసీసీఐ, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పట్లు చేశాయి. మమ్మల్ని ఈజీగా గమ్యం చేర్చాయి.’అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. టీమిండియాతో పోరు ఎప్పుడూ సవాలేనని విలియమ్సన్‌ చెప్పుకొచ్చాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నాడు. ‘ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడేందుకు ఆత్రుతగా ఉంది. ఇందులో గెలిస్తే మరింత బాగుంటుంది. తొలిసారి టైటిల్ కాబట్టి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. టీమిండియాతో ఎప్పుడు తలపడ్డా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. వారితో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ ఉంటారు. ఫైనల్‌ గెలిచేందుకే ప్రయత్నిస్తాం’ అని కేన్‌ విలియమ్సన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Related posts