తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. గత ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా..ఆమెకు పాజిటివ్గా తేలింది. కలెక్టర్తో పాటు.. డ్రైవర్కు, కంప్యూటర్ ఆపరేటర్కు కూడా కరోనా పాజిటివ్గా తేలింది.
హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రోజుకు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్-19 రికవరీ రేటు 67 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 41,018 కేసుల్లో ఇప్పటికే 27,295 మంది డిశ్చార్జ్ అయ్యారు.