ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని సమాచారం. విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే జగన్ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం.
ఆహ్వానం పై కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందిస్తూ, తాను తప్పకుండా వస్తానని చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.