పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తరహాలో వైసీపీ నేత జగన్ 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటాడని వైసీపీ నేత, నటుడు మోహన్ బాబు జోస్యం చెప్పారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయానికి సంబంధించి క్రెడిట్ మొత్తం జగన్ కే పోతుందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం జగన్ మామూలుగా కష్టపడలేదనిఅన్నారు. అలాంటి జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో అనూహ్య స్పందన వచ్చేదనీ, అప్పుడే జగన్ సీఎంగా గెలుస్తాడని తనకు అర్థం అయిందని చెప్పారు. జగన్ కు భగవంతుడు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తాడన్న నమ్మకం తనకు ఉందని మోహన్ బాబు అన్నారు.
అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!