telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన రేవంత్

Revanth-Reddy mp

వాస్తవాలను తెలియజేస్తే వారికి కరోనా వైరస్ రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయాలను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే.. వాస్తవాలు తెలియజేయాల్సిందిపోయి వారికి కరోనా రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టాలని అన్నారు. శత్రువులకైనా కరోనా రావద్దని కోరుకుంటామన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే వారికి కరోనా రావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని.. ప్రజలకు ఆయన ఏం సంకేతమిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. 

Related posts