telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ 5 ఫేమ్ మానస్ కొత్త వెబ్ సిరీస్ “చి ల సౌ రాంబాబు” ప్రారంభం

బిగ్ బాస్ ఫేం మానస్ నాగులపల్లి, రాజన్న ఫేం ఏనీ, వకీల్ సాబ్ ఫేం శివ కుమార్, కొత్తమ్మాయి కల్లపు కుషిత ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్న‌ కొత్త ఓటీటీ వెబ్ సిరీస్ “చి ల సౌ రాంబాబు” షూటింగ్ మహాశివరాత్రి రోజున (మార్చ్ 1) ప్రారంభం అయింది. మార్చ్ పది నుంచి రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకుని.. జూన్ నెలలో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్¬ఫార్మ్¬లో రిలీజ్ కాబోతుంది.

ఈ సిరీస్ కు PNR బాబు రచయిత మరియు దర్శకులు. రుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ చంద్ర సమర్పణలో రవి బందా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశి ప్రీతం సంగీతాన్ని అందిస్తున్నారు. రాజీవ్ వల్లభనేని ఛాయాగ్రాహకులు కాగా శివ గోపాల్ రెడ్డి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.

సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఓటీటీ రంగంలోకి ప్రవేశించిన రుద్ర ప్రొడక్షన్స్ కు ఇది మొదటి నిర్మాణం. వచ్చే రెండు సంవత్సరాల్లో కనీసం డజను చిత్రాలను ఓటీటీ మాధ్యమాలకు నిర్మించనున్నారు.

“బిగ్ బాస్ తరువాత అనేక కథలు విన్నాను. కానీ ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వగల మంచి కథ కోసం ఎదురు చూసాను. ఇది సరిగ్గా అలాంటి కధే. ఇందులో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది.” అని హీరో మానస్ నాగులపల్లి అన్నారు.

“నాకు రొమాంటిక్ కామెడీ కధలంటే చాలా ఇష్టం. ఇది చాలా సున్నితమైన బాగా నవ్వించే కధ.” అన్నారు. దర్శకుడు బాబు “ఓటీటీలో నాణ్యమైన రొమాంటిక్ కామెడీ కథలు తక్కువగా ఉన్నాయి.

ఈ చిత్రం చూసిన తరువాత అన్ని వర్గాల ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారన్న నమ్మకం నాకుంది.” ఏనీ అని అన్నారు.

 ‘క్వాలిటీ స్క్రిప్ట్స్ కే తమ తొలి ప్రాధాన్యమని, దానికి తగ్గట్టుగానే రాజీపడకుండా నిర్మించాలన్నది తమ ఆశయమని, రుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాబోయే రెండేళ్ళలో మరింతగా ఓటీటీ కంటెంట్ ను అందిస్తామని నిర్మాత రవి బండా అన్నారు. ఓటీటీ ప్లాట్¬ఫార్మ్ లకు రాబోయే రెండేళ్లలో డజన్ కు పైగా కంటెంట్ ను అందించబోతున్నాం” అని నిర్మాత రవి బందా అన్నారు.

Related posts