telugu navyamedia
క్రైమ్ వార్తలు

వాట్సాప్‌లో పరిచయం.. యువతిపై అత్యాచారం

హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. నిందితుడిని అదుపులోకి తీసుకునిని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని సులేమాన్‌నగర్‌లో నివసించే సాజిత్‌(27) ప్రైవేటు ఉద్యోగి. అతడికి రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోష్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(20)తో పరిచయం ఏర్పడింది.

ఇద్దరు ఫోన్‌ నంబర్లు సేక‌రించి ఛాటింగ్‌ చేసుకున్నారు. సాజిత్‌ మహిళను మంగళవారం కలవాలని కోరాడు. రాజేంద్రనగర్‌కు వచ్చిన మహిళను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని సులేమాన్‌నగర్‌లో నివసించే అతడి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు మహిళపై అత్యాచారం చేశాడు. మహిళ 100కు కాల్‌ చేయడంతో మేం అక్కడికి చేరుకొని సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా యువతి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడ్డ యువకుడితో పాటు మరో నలుగురిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts