telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విద్యార్థులకు జ్యూస్ లో వయాగ్రా కలిపి… ఆ తరువాత…!?

Tablets

గురువారం ఫ్లోరిడాలోని, లేక్‌ల్యాండ్ హై స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు తెలియకుండా జ్యూస్‌లో వయాగ్రాను కలిపి తాగించారు. అది తాగిన నలుగురు టీనేజర్స్ అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పాఠశాల యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోక్ కౌంటీ పోలీసులు వెంటనే విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం వారిని విచారించగా అసలు విషయం తెలిసింది. తోటి విద్యార్థి ఒకరు తమకు ఓ జ్యూస్ ఇచ్చాడని అది తాగిన వెంటనే తాము అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. దాంతో పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు మరో విద్యార్థితో కలిసి జ్యూస్‌లో మత్తు పదార్థం (ఏండీఏంఏ) కలిపి ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై మత్తు పదార్థాలను కలిగి ఉండడం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆ ఇద్దరిని తనిఖీ చేసిన పోలీసులకు ఒకరి వద్ద ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేని వయాగ్రా మందులతో పాటు ఇతర మత్తు పదార్థాలు దొరికాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న నలుగురిలో ఓ బాలిక పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోక్ కౌంటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts