రెండేళ్లకు పైగా రాజకీయాలతో బిజీగా ఉండి మళ్లీ ముఖానికి రంగు వేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ, తరవాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బహుశా ఈ సినిమా తరవాత బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ సినిమా ఉండే అవకాశం ఉంది.
తాజాగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్తో పవన్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం పవన్ సినిమా కథపై కసరత్తులు చేస్తున్న హరీష్ శంకర్. ఈ సినిమాలో ఆయన్ను ఓ విలక్షణ పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. లెక్చరర్ రోల్లో చూపిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పాఠాలు చెబుతూ విద్యార్థులకు భవిష్యత్ గైడ్ చేసే మాస్టర్గా పవన్ని చూపించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట హరీష్. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై హరీశంకర్ రూపొందించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గతంలో పవన్ కళ్యాణ్- హరీశ్ శంకర్ కాంబోలో రూపొందిన ‘గబ్బర్సింగ్’ ఇండస్ట్రీ హిట్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.