telugu navyamedia
సినిమా వార్తలు

షూటింగ్ పూర్తి చేసుకున్న గుణశేఖర్ ‘శాకుంతలం’

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఓ వీడియోను కూడా షేర్‌ చేసుకుంది. చిత్రబృందానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగం చెందారు దర్శక నిర్మాతలు.

సినిమా షూటింగ్ పూర్తై సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. చిత్రబృందానికి డైరెక్టర్‌ గుణ శేఖర్, చిత్ర నిర్మాత నీలిమా బహుమతులు అందచేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి సమంత ఇటీవలే తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు గుణశేఖర్.

ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సమంతా అక్కినేని ‘శకుంతల’ పాత్ర పోషిస్తుండగా, దేవ్ మోహన్ దుష్యంత్‌గా, అదితి బాలన్ గా అనసూయ, మోహన్ బాబు మహర్షి దుర్వాసుడు, గౌతమి, యాంకర్ వర్షిణి తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయస్తుంది. ఈ సినిమాలో అర్హా భరతుడి పాత్రలో కనిపించనుందట. 2022 ప్రారంభంలో ‘శాకుంతలం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts