telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తమ హయాంలోనే శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ: చంద్రబాబు

chandrababu

తమ హయాంలోనే శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదని చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ఈ అంశం గురించి చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కల్పించుకుని ట్రిపుల్ ఐటీని వైఎస్ హయాంలో ఏర్పాటు చేశారని అన్నారు.

ఈ విషయం శ్రీకాకుళం జిల్లాలో ఏ స్టూడెంట్ ను అడిగినా చెబుతారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలన్నది నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం అని చెప్పారు. రిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు కూడా ఆయన హయాంలోనే జరిగిందని చెప్పారు.

Related posts