telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

420కి జన్మదిన శుభాకాంక్షలు : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్

vijayasaireddy ycp

చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత ‘పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని’ ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ ‘బ్రీఫ్ డు అవసరం లేదు. సింహాచలం దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని గంటా సతీమణి చౌదరి మేడం నియమించారట! చంద్రబాబూ నీ పార్టీ దిగజారడానికి ఇక మెట్లు లేవు. 2 ఛానళ్లు, 2 పేపర్లలో చూసుకుని మురిసిపోవడమే. రాష్ట్రంలో ఇంకా పచ్చ పార్టీ ఉందనే భ్రమ కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా బాబూ? ” అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇక అంతకుముందు ట్వీట్ లో “ఏబీ వెంకటేశ్వరరావు…ఫోన్ ట్యాపర్. దేశ ద్రోహం కేసులో నిందితుడు. అతని సాక్ష్యానికి విలువేముంటుంది? కొడుకు కంపెనీ కోసం విదేశంతో కుమ్మక్కైన దేశ ద్రోహి అతను. సాక్ష్యాలుంటే షోడో హోం మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినట్లు? ప్రవర్తనా నిమావళిని ఉల్లంఘించినవాడా ప్రవర్తన గురించి మాట్లాదేది?” పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Related posts